సామాజిక ఉద్యమకారుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు అల్లం సుదర్శన్ అనారోగ్య కారణాలతో మరణించడం తీరని లోటని ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ అన్నారు.
సుదర్శన్ అనారోగ్య కారణాలతో హనుమకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. సుదర్శన్ భౌతిక కాయానికి బిక్షపతి నివాళి అర్పించారు. అనంతరం సొంత గ్రామం అయిన అంకన్నగూడెం జరిగిన అంతిమ యాత్రలో ఆయన పాల్గొన్నారు.
ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన వ్యక్తి సుదర్శన్ అని బిక్షపతి అన్నారు. ఆదివాసి ముద్దుబిడ్డ అయిన సుదర్శన్ సమాజ సేవ చేసే లక్షణాలు ఉన్న వ్యక్తి అని తనకు చిన్నప్పటి నుంచి మిత్రుడని బిక్షపతి తెలిపారు.