నిరుద్యోగ భృతి, ఉద్యోగస్తులకు పిఆర్సి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు ఏమైనాయని సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు యల్లావుల రాములు, మాజీ UTF నాయకులు ధూళిపాళ అనంత రామశర్మ అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఎమ్మెల్సీ ఓటర్లను కలిసిన వారు మాట్లాడుతూ, రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో నల్లగొండ, ఖమ్మం,వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి సీనియర్ జర్నలిస్ట్ జయసారథిరెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
డబ్బులతో వచ్చేవారిని నమ్మవద్దని, మన హక్కులకై నిరంతరం పోరాడే వ్యక్తుల్ని గెలిపించుకోవాలని కోరారు. ఉద్యోగులకు పిఆర్సి వెంటనే ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అంగన్వాడి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వ సంస్థలైన BSNL, బ్యాంకులు, ఎల్ఐసి, తదితర వాటిని ప్రైవేటీకరణ తక్షణమే నిలుపుదల చేయాలని చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చిన్నం వీరమల్లు, గుండెబోయిన వెంకన్న, జక్కుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.