30.2 C
Hyderabad
May 17, 2024 17: 33 PM
Slider మహబూబ్ నగర్

విలేకరులకు ప్లాట్లు ఇవ్వాలి:బిజెపి

#bjp

వనపర్తి పట్టణ బిజెపి అధ్యక్షుడు బచ్చు రాము ఆధ్వర్యంలో వనపర్తిలో ప్రతి ఒక్క విలేకరికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ మేరకు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. వనపర్తిలో కొద్ది మంది విలేకరులకు ప్లాట్లు ఇచ్చారని, అర్హులైన విలేకరులకు ఇవ్వలేదన్నారు. అక్రీడెసన్ ఉన్న వారికి, లేని విలేకరులకు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రామన్న గారి వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ జ్యోతి, గోపాల్పేట్ మండల అధ్యక్షుడు అరవింద్ రెడ్డి, వనపర్తి జిల్లా దళిత మోర్చా నారాయణ పాల్గొన్నారు.

స్థలం కోసం విలేకరి దరఖాస్తు

వనపర్తిలో తమకు ఇంటి స్థలం కేటాయించాలని సూర్య దినపత్రిక విలేకరి యాదగిరి రమేష్ సెల్ నంబర్ 9966084549 జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన దరఖాస్తులో కోరారు. స్వంత ప్లాటు, ఇల్లు లేదని, అద్దె ఇంటిలో ఉంటున్నామని అయన తెలిపారు. వనపర్తిలో గతంలో ప్రభుత్వం నుండి ప్లాటు తీసుకున్న వారు మళ్ళీ ప్లాటు తీసుకున్నారని, బయటి ప్రాంతానికి చెందిన వారు ప్లాట్లు తీసుకున్నారని అయన తెలిపారు. విచారణ చేసి పట్టాలు రద్దు చేయాలని అయన కోరారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ఇబ్రహీంపట్నం సబ్ స్టేషన్ ముట్టడించిన కోమటిరెడ్డి

Satyam NEWS

మన్నార్ రాజ‌గోపాల స్వామి ఆల‌యంలో శుభకృత్ ఉగాది ఉత్స‌వాలు

Satyam NEWS

నిరవధిక నిరాహార దీక్ష విరమించిన ఆర్టీసీ జేఏసీ నేతలు

Satyam NEWS

Leave a Comment