33.2 C
Hyderabad
May 15, 2024 19: 47 PM
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్యే రాచమల్లు పై ఉక్కు ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

#ukkupraveen

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై టిడిపి ఇన్ ఛార్జి  ప్రవీణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొద్దుటూరు అంటే సిరిపురం అనే పేరు పోయి క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కు కేరాఫ్ అడ్రస్ అయ్యిందని ఆయన తెలిపారు. క్రికెట్ బుకీలను కౌన్సిలర్లను చేసిన ఘనత ఎమ్మెల్యే రాచమల్లుకే దక్కింది.. అసాంఘీక కార్యక్రమాలకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి బిగ్ బాస్.. క్రికెట్ బుకీలకు ఎమ్మెల్యే రాచమల్లు రెడ్ కార్పెట్ వేశాడు..అంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

ప్రొద్దుటూరులోని ఇద్దరు సీఐలు, ఎస్పీ స్పెషల్ దాడుల గురించి బుకీలకు ముందుగానే సమాచారం ఇచ్చారని ఆయన అన్నారు. భూకబ్జా శాఖాధిపతి ఎమ్మెల్యే అన్న కిరణ్ కుమార్ రెడ్డే.. క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అధిపతి వార్నింగ్ స్టార్ మరొకరు.. రాచమల్లును ఎమ్మెల్యేను చేయడానికి కష్టపడ్డాడు కొత్తపల్లె సర్పంచ్ శివచంద్రారెడ్డి.. రెండు సెంట్లు స్థలంలో ఇల్లు కట్టి ఇస్తానని ఎమ్మెల్యే గత ఎన్నికల్లో హామీ ఇచ్చాడు.. అయితే అలా చేయలేదు అని ఆయన అన్నారు. వందల కోట్లు ఆస్తి ఎమ్మెల్యే రాచమల్లుకు ఎలా వచ్చింది అని కూడా ఆయన ప్రశ్నించారు.

దొంగనోట్ల, గుట్కా, మట్కా, పేకాట, బెట్టింగ్ ఆడిస్తూ 50 ఏళ్ల ప్రొద్దుటూరు చరిత్రను ఎమ్మెల్యే రాచమల్లు నాశనం చేశాడని ఉక్కు ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related posts

దుబ్బాక లో ఏప్రిల్ 10న లోక్ అదాలత్

Satyam NEWS

బ్లెసింగ్ గాస్పెల్ మిసిస్ట్రీస్ చర్చి ప్రారంభం

Satyam NEWS

త్వరలో 250 కొత్త పంచాయతీలు

Bhavani

Leave a Comment