27.7 C
Hyderabad
April 26, 2024 05: 29 AM
Slider విజయనగరం

మన్నార్ రాజ‌గోపాల స్వామి ఆల‌యంలో శుభకృత్ ఉగాది ఉత్స‌వాలు

#mannartemple

ఉత్స‌వాల‌కు హాజ‌రుకానున్న మంత్రి బొత్స‌, విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి

ఏపీలో కొత్తగా జిల్లా లు ఏర్పాటవబోతున్న సందర్భంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆఖరు ఉత్సవం..శుభకృత్ నామ కొత్త ఏడాది ఉత్సవాలు నగరంలో ని కొత్త పేటశ్రీ మ‌న్నార్ రాజ‌గోపాల స్వామి ఆల‌యంలో జరగనున్నాయి. ఈ మేరకు శుభ‌కృత్ నామ ఉగాది ఉత్స‌వాల‌ను అట్ట‌హాసంగా నిర్వ‌హించేందుకు అధికార‌ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్స‌వాలకు రాష్ట్ర పుర‌పాల‌క శాఖ‌ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, ఇత‌ర అధికారులు భాగ‌స్వామ్యం కానున్నారు.

ఉత్స‌వాల‌ను వైభ‌వంగా నిర్వ‌హిందుకు అధికారులు ఇప్ప‌టికే అన్ని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆల‌యం లోపల అతిథులు ఆశీనులై పంచాగ శ్ర‌వ‌ణం, వేద‌ప‌ఠ‌నం వినేందుకు అనుగుణంగా వేదిక‌లు ఏర్పాటు చేశారు. సాధార‌ణ భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉత్స‌వాల‌ను నిర్వ‌హించేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌లూ తీసుకున్న‌ట్లు జాయింట్ క‌లెక్ట‌ర్ జె. వెంక‌ట‌రావు పేర్కొన్నారు.

ఈ మేర‌కు ఆయ‌న వివిధ శాఖ‌ల అధికారుల‌తో ఈ మేరకు స్థానిక ఆల‌యంలో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌తి ఒక్క‌రూ స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం స్థానిక కేబుల్‌, ఎల‌క్ట్రానిక్‌ మీడియా ఛానెళ్ల ద్వారా ఉత్స‌వాల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు జేసీ ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.

Related posts

రెండో సారి ఎన్నికై రికార్డు సృష్టించిన ఏలూరు మేయర్ నూర్జహాన్

Satyam NEWS

ఓ వైపు వలంటీర్లకు సేవాపతకాలు..మరోవైపు ఆ వలంటీర్లే రోడ్లపై త్రిబుల్ డ్రైవింగ్..!

Satyam NEWS

మూడవ వసంతంలోకి అడుగుపెట్టిన హోమ్ టుడే ఫర్నిచర్

Satyam NEWS

Leave a Comment