మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లిలో నాలాలో కొట్టుకుపోయిన మిథున్ రెడ్డి(4) అనే బాలుడు మృతి చెందాడు. ప్రగతినగర్ తురక చెరువులో బాలుడి మృతదేహం డీఆర్ఎఫ్ సిబ్బందికి లభ్యమయింది. మధ్యాహ్నం బాచుపల్లిలో నాలాలో కొట్టుకుపోయిన బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు, స్థానికులు వెతికారు.
వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. డీఆర్ఎఫ్(DRF) బృందాలు బాలుడి కోసం గాలించాయి. బాలుడి ఆచూకీ లభించిన.. తను మాత్రం ప్రాణాలతో లేకపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సూర్యాపేటకు చెందిన సంతోష్ రెడ్డి దంపతుల కుమారుడు మిథున్ రెడ్డి . ఓ ఫార్మా కంపెనీలో ఆయన పని చేస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు ఇంటి ముందు ఆడుకుంటూ పక్కనే ఉన్న నాలాలో బాలుడు పడిపోయాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కలంతా వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో స్థానికులతో కలిసి కుటుంబ సభ్యులు గాలించసాగారు.