కారణం ఏమిటో తెలియదు కానీ వృద్ధుడైన ఒక గెర్రెల కాపరిని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్త పల్లి లో జరిగింది. పెద్ద కొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామ శివారులో జరిగిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. 62 సంవత్సరాల గొర్రెల కాపరి వసంత ఎర్రయ్య ను నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారని కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి తెలిపారు. అదే గ్రామానికి చెందిన ఎల్లయ్య వ్యవసాయ పొలంలో తన గొర్ల మంద వద్ద కాపలాగా ఉండగా గుర్తు తెలియని వ్యక్తి గొడ్డలి తో అతని తలమీద కొట్టి చంపారని సీఐ తెలిపారు. ఈ మేరకు అతని పెద్ద కుమారుడు రమేష్ ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి తెలిపారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్