32.7 C
Hyderabad
April 27, 2024 02: 59 AM
Slider మహబూబ్ నగర్

గొర్రెలకాపరిని కొట్టిచంపిన అగంతకులు

#kollapurpolice

కారణం ఏమిటో తెలియదు కానీ వృద్ధుడైన ఒక గెర్రెల కాపరిని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్త పల్లి లో జరిగింది. పెద్ద కొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామ శివారులో జరిగిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. 62 సంవత్సరాల గొర్రెల కాపరి వసంత ఎర్రయ్య ను నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారని కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి తెలిపారు. అదే గ్రామానికి చెందిన ఎల్లయ్య వ్యవసాయ పొలంలో తన గొర్ల మంద వద్ద కాపలాగా ఉండగా గుర్తు తెలియని వ్యక్తి గొడ్డలి తో అతని తలమీద కొట్టి చంపారని సీఐ తెలిపారు. ఈ మేరకు అతని పెద్ద కుమారుడు రమేష్ ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి తెలిపారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

ఘోర భూకంపం లో 128 మంది మృతి

Satyam NEWS

కడప జిల్లాలో కార్మికుల నాయకుల ముందస్తు అరెస్టు

Satyam NEWS

బీఆర్ఎస్ గెలవాలని అజ్మీర్ దర్గాలో చాదర్ సమర్పణ

Satyam NEWS

Leave a Comment