25.2 C
Hyderabad
May 16, 2024 21: 38 PM
Slider ఆధ్యాత్మికం

వేడుకగా శ్రీ సౌమ్యనాధ స్వామి ధ్వజా రోహణం

#nandaluru

అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ భూదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాధస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నందలూరులోని  ప్రసిద్ద చెందిన పురాతన  శ్రీ భూదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజా రోహణంతో వేడుకగా మొదలైనాయి.

గురువారం వైఖానుస ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజా రోహణం నిర్వహించారు.విశ్వషేణుని పూజ, పుణ్య ఆవాచనం,గరుడ ప్రతిష్ట,సర్వదేవతా ఆహ్వానం, అభిషేకం,హారతి శాస్రోక్తంగా నిర్వహించారు.వేద పండితులు ధ్వజపటనం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.

మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు,భక్తుల గోవింద నామాల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయ బ్రహ్మోత్సవ కమిటీ ఆలయ బ్రహ్మోత్సవాల కమిటీ గౌరవ అధ్యక్షుడు మేడా బాస్కర్ రెడ్డి,మేడా విజయ శేఖర్ రెడ్డి,ఆలయ చైర్మన్ అరిగెల సౌమిత్రి తదితరులు పాల్గొన్నారు.

ఆలయ ప్రాంగణంలో ముందు రోజు రాత్రి పుట్టమన్ను సేకరించి నవధాన్యాలతో కలిపి ఆలయంలో ఉంచిన  12 పాలికల్లో ఉంచి బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.

Related posts

రాజకీయ నేపథ్యంలో వస్తున్న సర్కారువారి పాట

Satyam NEWS

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి

Satyam NEWS

అంబర్ పేట్ లో బోనాల చెక్కుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment