సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తదుపరి చిత్రం సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబి ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి దర్శకుడు గీతగోవిందం ఫేమ్ పరశురాం. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా లాంఛనంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతున్నది. తాజా రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టే పొలిటికల్ డ్రామా ఇది అని తెలిసింది.