బోనాల పండుగ సందర్భంగా సందర్భంగా ఎమ్మెల్యే అంబర్ పేట నియోజకవర్గంలోని అన్ని డివిజన్ ల కార్పొరేటర్ లు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్, గోల్నాక కార్పొరేటర్ దుసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, బాగ్ అంబర్ పేట కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి, నల్లకుంట కార్పొరేటర్ అమృత, ఎండోమెంట్ అధికారులతో కలిసి ఆలయ కమిటీ నిర్వాహకులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ఆలయాలకు నిధులు మంజూరు చేయడం జరిగందన్నారు. అంబర్ పేట నియోజక వర్గ ప్రజలంత భక్తి శ్రద్ధలతో బోనాల పండుగను జరుపుకోవాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఆలయాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్