కుషాయిగూడలోని చర్లపల్లి డివిజన్ శివ సాయి నగర్ కాలనీలో సీసీ రోడ్డును కబ్జా చేసి నిబంధనకు విరుద్ధంగా అక్రమంగా నిర్మిస్తున్న ఇంటిపై మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకుడు కాసుల రవీందర్ గౌడ్ కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. శనివారం సర్కిల్ కార్యాలయంలో ఉప కమిషనర్ శంకర్ ను కలిసి అక్రమంగా నిర్మిస్తున్న ఇంటిపై, రోడ్డు కబ్జాపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కాసుల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ… శివ సాయి నగర్ కాలనీ రోడ్ నెంబర్ 4 లో… ప్లాట్ నెంబర్ 3 బి యజమాని తన ప్లాటు చుట్టూ ఉన్న మూడు వైపులా సిసి రోడ్డును యదేచ్చగా… కబ్జా చేసి ఇంటి నిర్మిస్తున్నారని తెలిపారు. దీంతో రోడ్డు కూచించకపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతుందన్నారు.
రోడ్డు చిన్నగా మారడంతో వీధుల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే జి ప్లస్ టు ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకొని… అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నాడని ఆరోపించాడు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తూ… జిహెచ్ఎంసి ఆదాయానికి గండి కొడుతున్నాడని పేర్కొన్నాడు.
నిబంధనకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఇంటిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్లు తెలిపారు . లేనిపక్షంలో కాలనీవాసులతో కలిసి ధర్నా చేపడతామన్నారు. అలాగే అక్రమ నిర్మాణం పై జిహెచ్ఎంసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్నాడు.
సత్యం న్యూస్ : ఉప్పల్ నియోజకవర్గం