ఉత్తరాంధ్ర… గంజాయి కి అడ్డాగా మారిందా…? లేక గంజాయి అక్రమరవాణకు కేరాఫ్ అడ్రస్ అయ్యిందా..? నిన్న కాక మొన్ననే విశాఖ జిల్లా పెందుర్తి లో దాదాపు 100కేజీల గంజాయి పట్టు బడటంతో..రాష్ట్ర డీజీపీ సీరియస్ గా నే తీసుకున్నారు.
ఈ క్రమంలో ఉత్తరాంధ్ర లో మరీ విజయనగరం ,విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో జల్లెడ పడుతున్నారు… పోలీసులు. గడచిన రెండు రోజుల నుంచీ రెండు జిల్లా ల పోలీసులు… విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ప్రధానంగా విజయనగరం, బొడ్డవర ,ఎస్.కోట ,,అలాగే పార్వతీపురం మన్యం జిల్లా లో సంబంధిత ఎస్పీ ఆదేశాలతో అన్ని జిల్లాల స్టేషన్ హౌస్ ఆఫీసర్లు… జల్లెడ పడుతున్నారు.
ఇందులో భాగంగా విజయనగరం లో వన్ టౌన్, టూటౌన్, రూరల్ సీఐలు..డా.వెంకట్రావు, లక్ష్మణరావు, తిరుపతి రావులు..అన్న లాడ్జీలు…రూంలు..వసతి గృహాలలో విస్తృతంగా తనిఖీలు చేసారు. అలాగే విజయనగరం జిల్లా వ్యాప్తంగా… ఎస్పీ దీపికా ఆదేశాలతో పోలీసులు… ఈ సాయంత్రం కూడా వాహనాలను తనిఖీ చేయడం విశేషం.