ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాప్రా సర్కిల్ సాయి ప్రియ కాలనిలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో మణికంఠ ఫోటో స్టూడియో పూర్తిగా దగ్ధంమై పోయిన విషయం తెలిసినదే.ఈ అగ్నీ ప్రమాదంలో సుమారు ఇరవై లక్షల రూపాయల అస్థినష్టం జరిగిందని,కాప్రా ఫోకస్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
అసోసియేషన్ యొక్క సమస్యపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితుడు రవికి న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫోకస్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు రమణశ్రీ,రమేష్, ఆంజనేయులు, రాజు, నరేష్,యకయ్య,రవి కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు