రోజు రోజుకూ పెరిగిపోతున్న పెట్రోలు, డీజిల్ ధరలకు నిరసనగా ఎంఐఎం పార్టీ గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈరోజు నరసరావుపేట మార్కెట్ సెంటర్ లో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఎంఐఎం పార్టీ నాయకుడు మస్తాన్ వలి మాట్లాడుతూ బీజేపీ పాలన లో చమురు ధరలు, రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, ధరల నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు.
మన దేశం నుంచి చమురు దిగుమతి చేసుకునే శ్రీలంక లో లీటర్ పెట్రోల్ 53రూపాయలకు ఆ దేశం ఆ దేశ ప్రజలకు అందిస్తుంటే, మన దేశ ప్రధాన మంత్రి మాత్రం మన దగ్గర దోచుకొని అంబానీ లాంటి వారికీ ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.
నిత్య అవసరాల వస్తువుల ధరలు ఆకాశానికి అంటినా బీజేపీ వారికి పట్టదని వారికీ కావాల్సిందల్లా కులమతాల మధ్య చిచ్చుపెట్టటం మాత్రమేనని ఆయన అన్నారు.