ఉప్పల్ నియోజకవర్గం లోని కాప్రా ప్రాంతానికి చెందిన కురునెల్లి సలోమి,సెంట్ తెరిసా స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నది.చిన్నతనం నుండి కరాటేలో రాణిస్తుండడంతో తండ్రి వెంకట్ డ్రాగన్ ఫస్ట్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ సత్య శంకర్ దగ్గర శిక్షణ ఇప్పించాడు.
ఈ నెల నేపాల్లో జరిగిన ఇంటర్ నేషనల్ హీరోస్ గేమ్ ఛాంపియన్ షిప్ -2022 అర్గునేజర్ బై స్పోర్ట్స్ డవలప్మెంట్ ఫెడరేషన్ నేపాల్, రంగస్థలం స్టేడియంలో ఈ నెల 1వ తేది నుండి 5తేది వరకు జరిగిన అండర్ 14విభాగంలో పాల్గోని కురునెల్లి సలోమి గోల్డ్ మెడల్ ను సాధించింది.
ఈ సందర్భంగా నేపల్ స్పోర్ట్స్ పెడరేషన్ అధ్యక్షుడు ప్రదీప్ రోట్, పతాకాన్ని అందచేశారు. ఇంటర్ నేషనల్ స్పోర్ట్స్, కోఆర్డినేటర్,ఆర్గనైజర్ మోను కుమార్,మాస్టర్స్ గెలుపొందిన సమాచారాన్ని తెలుసుకున్న మాస్టర్ సత్య శంకర్ ను అభినందించారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి