టిక్ టాక్ లో యాక్టీవ్ గా ఉంటే నలుగుర్ని పాకిస్తాన్ లోని కరాచీలో కొందరు కాల్చి చంపారు. అగంతకులు కాల్చి చంపిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు.
చనిపోయిన నలుగురిలో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. వారిని ముస్కాన్, అమీర్ అని గుర్తించారు. ముస్కాన్ అమీర్ ను పిలిచి మరో ఇద్దరు కూడా వస్తున్నారని నలుగురం కలుద్దామని చెప్పాడు.
దాంతో రెహాన్, సాజిద్ కూడా కరాచీలోని గార్డెన్ ఏరియాకు వచ్చారు. మొత్తం నలుగురూ సిటీ మొత్తం చూసి అక్కడక్కడ టిక్ టాక్ వీడియోలు చేసుకుని గార్డెన్ వద్దకు తిరిగి వచ్చారు.
కారులో కూర్చుని ఉండగానే మహిళను పిస్తోలుతో కాల్చి చంపిన అగంతకులు మిగిలిన ముగ్గుర్ని బయటకు తీసుకువచ్చి చంపారు.
వ్యక్తిగత కారణాలతోనే ఈ హత్యలు జరిగి ఉంటాయని కరాచీ పోలీసులు తెలిపారు. అయితే హత్యలకు వారు గతంలో చేసిన టిక్ టాక్ వీడియోలకు ఏదైనా సంబంధం ఉందా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు.