ఏపీ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు.
మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అదే విధంగా జూలై 21వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని తెలిపారు.
టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఇది (ఏడు పేపర్లు)
జూన్ 7 (సోమవారం) : ఫస్ట్ లాంగ్వేజ్
8 (మంగళవారం) : సెకండ్ లాంగ్వేజ్
9 (బుధవారం) : ఇంగ్లీష్
10 (గురువారం) : గణితం
11 (శుక్రవారం) : ఫిజికల్ సైన్స్
12 (శనివారం) : బయోలాజికల్ సైన్స్
14( సోమవారం) : సోషల్ స్టడీస్
15 ( మంగళవారం) : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2
ఓఎస్ఎస్సీ మేయిన్ లాంగ్వేజ్ (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
16 ( బుధవారం ) ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు(థియరీ)