తెలంగాణలో ఏకైక ఆర్యవైశ్య పంచాంగకర్త డా॥ సోమవరపు రామలింగయ్య గుప్త రచించిన శ్రీ శుభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆవిష్కరించారు.
ఈరోజు ఉదయం హైదరాబాద్ నాగోల్ లోని ఉప్పల శ్రీనివాస్ గుప్త నివాసంలో తెలంగాణలో ఏకైక ఆర్యవైశ్య పంచాంగకర్త డా॥ సోమవరపు రామలింగయ్య గుప్త మర్యాద పూర్వకంగా కలిసారు. 16 సంవత్సరాల అనుభవం కలిగిన, 1986 లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉప్యాన్యాస బహుమతి గ్రహీత, 2003 జనవరి 31 న ప్రభుత్వ కళాశాలలో సీనియర్ లెక్చరర్ గా పదవీ విరమణ పొందిన వ్యక్తి డా॥ సోమవరపు రామలింగయ్య గుప్త. ఆయన రచించిన శ్రీ శుభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాంగకర్త డా॥ సోమవరపు రామలింగయ్య గుప్త తో బాటు సరాబ్ లక్ష్మన్ గుప్త, జనరల్ సెక్రటరీ హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, సోమవరపు ఓమన్ కుమార్ MCA సాఫ్ట్ వేర్ ఇంజనీర్, చంద్ర ప్రకాష్ గుప్త తదితరులు పాల్గొన్నారు.
previous post