29.7 C
Hyderabad
May 2, 2024 04: 38 AM
Slider ప్రకాశం

సమస్యలు సృష్టిస్తున్న వారి నుంచి మా భూములు కాపాడండి

#manchirevula

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం గ్రామ శివారు మూడుముళ్ల రేవు వద్ద ఉన్న ఖాళీ భూములను నిరుపేద రైతులకు ఇవ్వాలని మూడు మళ్ళ రేవు రైతు సంఘం విజ్ఞప్తి చేసింది.

బుధవారం ఉదయం వేటపాలెం తహశీల్దార్ కె.లింగమహేశ్వ రరావు ను కలిసి వినతిపత్రం అందజేశారు.

గత 20 సంవత్సరాలుగా బీడు భూములు గా ఉన్న పులగ కాలువ ఎగువ భూములను సాగు లోనికి తీసుకు రావడం ద్వారా నిరుపేద రైతుల కుటుంబాలకు సరిపడా తిండిగింజలు పండించే అవకాశం ఉంటుందని సంఘం తహశీల్దార్ దృష్టికి తీసుకువెళ్లారు.

సంఘం అధ్యక్షులు మీసాల వెంకయ్య మాట్లాడుతూ… కొందరు వ్యక్తులు సదరు భూములు మాసొంతం అంటూ సాగు చేస్తున్న రైతులకు ఆటంకాలను కలగచేస్తున్నారని, దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న భూములను సంఘం ఆధ్వర్యంలో సాగుబడి చేస్తుంటే కొందరు వ్యక్తులు కావాలని కులం పేరుతో ఇతరులను రెచ్చగొట్టి సమస్యలు సృష్టిస్తున్నారని తెలిపారు.

రైతుసంఘ నాయకులు బట్టు మస్తాను, చల్లా సుబ్బారావు, కాటి దాసు, పుట్టా నాగేశ్వరరావు, యర్రవరపు కిరణ్, ఈమని వీరయ్య, కుమ్మరి వీరారెడ్డి, భోగి రెడ్డి వెంకటశివారెడ్డి, ఒలుకుల అయ్యప్ప, కొమరగిరి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేంద్ర ఏజెన్సీలను విచ్చలవిడిగా వాడుకుంటున్న బిజెపి

Satyam NEWS

ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్తనా నియ‌మావ‌ళిని ఉల్లంఘించారో….

Satyam NEWS

వైభవంగా శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

Satyam NEWS

Leave a Comment