యాసంగి వడ్లను కేంద్రమే కొనాలని కామారెడ్డి జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం డిమాండ్ చేసింది. కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శోభా రాజు అధ్యక్షతన నేడు సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే, ఎల్లారెడ్డి శాసనసభ్యుడు సురేందర్ పాల్గొన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రెండు పంటలు పూర్తిగా కొనుగోలు చేస్తుందని చైర్ పర్సన్ శోభ తెలిపారు. అక్కడ పండించే గోధుమలు, వడ్లు కూడా కేంద్రమే కొంటుందని తెలిపారు. అదే విధంగా తెలంగాణ లో పండించిన పూర్తి వడ్లు కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జి.లాలయ్య సత్యంన్యూస్.నెట్, జుక్కల్ నియోజకవర్గం
previous post