ప్రియురాలి ముందు బిల్డప్ కోసం ఓ యువకుడు పెద్ద రిస్కే చేశాడు. ఆమె కోసం ఆ యువకుడు దొంగగా మారాడు. ఈ విచిత్ర సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో వెలుగు చూసింది. థానే జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతంలో ఖరీదైన మోటార్సైకిళ్లను దొంగిలించిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 13 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. నిందితుడు శుభం భాస్కర్ పవార్ అనే యువకుడు. తన ప్రియురాలిని ఇంప్రెస్ చేసేందుకు గానూ ఖరీదైన మోటార్బైక్లను దొంగిలించాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ III-కళ్యాణ్) సచిన్ గుంజాల్ మీడియాకు వెల్లడించారు. అతడిని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడు చెప్పిన నిజం తెలిసి ఖాకీలే కంగుతిన్నారు. కేవలం తన ప్రేయసిని సంతోష పెట్టేందుకే ఈ చోరీలకు పాల్పడినట్లు చెప్పాడు. తాను మొత్తం 13 బైక్లు దొంగిలించినట్లు శుభం విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో లాతూర్, షోలాపూర్, పూణెతో సహా పలు ప్రాంతాల నుంచి రూ. 16.05 లక్షల విలువైన 13 చోరీ చేసిన మోటర్బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
previous post
next post