38.2 C
Hyderabad
May 3, 2024 22: 22 PM
Slider ప్రత్యేకం

 తుమ్మల పయనమెటు

#tummala

బి‌ఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రయాణం పై జోరుగా  చర్చలు జరుగుతున్నాయి. పార్టీ నేతలపై గరంగా ఉన్న ఆయనను ఇటీనలే  లైన్లోకి తెచ్చారు. రాజకీయాల్లో కేసీఆర్ తో సమానమైననేతగా ఉన్న తుమ్మల కాలం కలిసి రాక రాజకీయాల్లో ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్న తుమ్మల కు కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు . గత ఎన్నికల్లో మంత్రిగా ఉండి తుమ్మల ఓడిపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు . నాటినుంచి కేసీఆర్  తుమ్మల దూరంగానే వున్నారు. తుమ్మల గులాబీ పార్టీలో చేరిన తర్వాత జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ సీట్లు తమ ఖాతాలో పడతాయని కేసీఆర్ అనుకున్నారు . కానీ అందుకు విరుద్ధంగా చివరకు తుమ్మల కూడా  ఓడిపోవడం సీఎం కేసీఆర్ ను సైతం షాక్ కు గురిచేసింది. 2018 ఎన్నికల్లో గెలిచిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ మంత్రి అయ్యారు .తన ఓటమిలో సొంతపార్టీ నేతలే కీలకంగా వ్యవరించారని తుమ్మల భావించారు . పైగా తనపై కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి గులాబీ గూటికి చేరారు . దీంతో నియోజకవర్గంలో కందాల మాట చెల్లుబాటు కావడం తో తుమ్మల తట్టుకోలేక పోయారు . అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తాను పాలేరు లో తిరిగి పోటీచేస్తానని బహిరంగంగానే చెబుతున్నారు . దీంతో కందాల ,తుమ్మల మధ్య నియోజకవర్గంలో వార్ జరుగుతుంది. బీఆర్ యస్ లో రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్నారు . చివరికి పోలీస్ స్టేషన్ వరకు కేసులు వెళ్లాయి. బీఆర్ యస్ టికెట్స్ ను తిరిగి సిట్టింగ్ లకు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడంతో కందాల తనకే టికెట్ అనుకుంటున్నారు .

అయితే ఖమ్మంలో జరిగిన బీఆర్ యస్ సభ సందర్భంగా పార్టీకి దూరంగా ఉంటున్న తుమ్మలను ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు బుజ్జగించారు . బీఆర్ యస్ ఖమ్మం సభ సందర్భంగా అక్కడే మకాం వేసిన హరీష్ రావు జిల్లాపార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలను సరిదిద్దే ప్రయత్నం చేశారు .  ఆయనకు మంత్రి పదవి వస్తుందంటూ పుకార్లు ,షికార్లు చేస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు సంబరపడి పోతున్నారు . ఇలాంటి పుకార్లు జరగటం తుమ్మల విషయంలో కొత్త కాకపోయినా ,ఈసారి ఎన్నికలు తొందరలో ఉండటం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారతారని ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా తుమ్మలను దగ్గరకు తీసి మంత్రి పదవి ఇస్తారని సోషల్ మీడియా లో వార్త చక్కర్లు కొడుతోంది. ఇది నిజమేనేమో అన్నంతగా వార్తకు బలం చేకూర్చే వాదనలు పెడుతున్నారు . ఇప్పుడు ఖమ్మం జిల్లా నుంచి పువ్వాడ అజయ్ మంత్రిగా ఉన్నారు . తుమ్మల కు మంత్రి ఇవ్వాలంటే అజయ్ ని తియ్యాలి . అజయ్ అభివృద్ధిలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలిచారని సీఎం నే స్వయంగా చెబుతున్నారు . అలాంటపుడు ఒకే సామజిక వర్గానికి ఒకే జిల్లా నుంచి రెండు మంత్రి పదవులు ఇవ్వడం అనేది సాధ్యం అయ్యేపని కాకపోవచ్చు . ఇప్పటికే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కు టీడీపీ నుంచి టీఆర్ యస్ లో చేరే సందర్భంగా ఇస్తానన్న మంత్రి పదవి ఇవ్వలేదు .హరీష్ రావు పార్టీలోని ఎడమొఖంపెడ ముఖం ఉన్నవాళ్లను అందరిని దగ్గరకు చేర్చారు . వివిధ నియోజకర్గాల పర్యటనల్లో వారిని పాల్గొనేలా చేశారు . అయితే ఇది తాత్కాలిక ఐక్యతనా, పర్మినెంట్ ఐక్యతా అనే అంటే . తాత్కాలికమే అంటున్నారు పరిశీలకులు .  

Related posts

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన ధర్నాను జయప్రదం చేయండి

Satyam NEWS

పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్

Bhavani

ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ప్లెక్సీలు తొలగింపు

Murali Krishna

Leave a Comment