తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. చెన్నైకి చెందిన ఓ ప్రేమ జంట అందరూ చూస్తుండగానే ఆత్మహత్యానికి పాల్పడింది. ప్రేమికులిద్దరూ చెన్నై బీచ్ నుండి తాంబరం వరకు రైల్లో బయల్దేరారు. మార్గ మధ్యలో ఇద్దరూ ఒకరినోకరు కౌగిలించుకుని రైల్లోంచి కిందకు దూకేశారు. ఈ ఘటనతో ప్రియురాలు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ప్రియుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తాంబరం చెన్నై కోస్టల్ లైన్ చెన్నై శివారు ప్రాంతాలను, చెన్నైని కలిపే అత్యంత ముఖ్యమైన రైలు మార్గం. ఈ మార్గంలో ప్రతిరోజూ వందలాది రైళ్లు నడుస్తాయి. ముఖ్యంగా చెన్నై, చెన్నై సబర్బన్ లకు ఎలక్ట్రిక్ రైళ్లు నడపబడుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి 8:30 గంటలకు చెన్నై బీచ్ నుండి తాంబరం వైపు ఎలక్ట్రిక్ రైలు బయలుదేరింది. ఇంతలోనే ఓ ప్రేమ జంట కౌగిలించుకుని రైలు ముందుకు దూకింది. తలకు బలంగా తగలడంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రియుడు తీవ్ర గాయాలతో రక్తమోడుతూ అపస్మారక స్థితిలో ఉన్నాడు. గమనించిన కో పైలట్ వెంటనే రైలు ఆపేశాడు. సమాచారం అందుకున్న మాంబళం రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని రక్షించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనను గమనించిన ప్రయాణికులను పోలీసులు విచారించారు.
previous post
next post