శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండం పొన్నాడ కేజీబీవీలో సమీప గ్రామానికి చెందిన విద్యార్థిని ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. మూడు నెలల క్రితం శ్రీకాకుళం డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన క్రీడాపోటీల్లో పాల్గొంది. ఆ సమయంలో వరుసకు బావ అయ్యే వ్యక్తి, ప్రేమ-పెళ్లి పేరుతో ఆమెను ఇబ్బంది పెట్టి అత్యాచారం చేశాడు. విషయాన్ని ఆ బాలిక గోప్యంగా ఉంచింది. యథావిధిగా సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చేసింది. రెండు రోజుల క్రితం ఆ అమ్మాయికి వాంతులు రావడం, డాక్టర్లు గర్భిణీగా తేల్చడంతో టీచర్లు అప్రమత్తమయ్యారు. విషయం బయటకు పొక్కకుండా ప్రిన్సిపాల్ శిరీష జాగ్రత్త పడ్డారు. అయితే ఆమె అంటే గిట్టని వారు రాష్ట్ర ఉన్నతాధికారులు సమాచారం చేరవేశారు. వెంటనే ప్రిన్సిపాల్ శిరీషపై వేటు పడింది. దీంతో పాటు ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థిని గర్భం దాల్చిన ఘటనపై విచారణ జరపాలని ప్రభుత్వం కమిటీ వేసింది.
previous post