40.2 C
Hyderabad
May 6, 2024 15: 12 PM
Slider ముఖ్యంశాలు

బ్రాహ్మణ నిరుద్యోగులకు హైదరాబాద్ లో ఉచిత భోజన వసతి

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న బ్రాహ్మణ నిరుద్యోగులకు, విద్యార్థులకు శుభవార్త. తెలంగాణా ప్రభుత్వం జంబో జాబ్ మేళా ప్రకటించింది. ఏకంగా వేలాది ఉద్యోగాలను ప్రకటించిన సీఎం కేసీఆర్ దశలవారిగా ఆయా సంబంధిత జాబ్ నోటిఫికేషన్లు జారీచేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇదో మంచి సదవకాశం. జీవితంలో శాశ్వతంగా స్థిరపడేందుకు వచ్చిన మంచి తరుణం. ఉద్యోగాలు సాధించేందుకు పోటీ పరీక్షల కోసం హైదరాబాద్ వస్తున్న బ్రాహ్మణ యువతకు మంచి అవకాశం కల్పించ బోతున్నారు ప్రణీత్ గ్రూప్ చైర్మన్ నరేంద్ర కుమార్.

నిర్మాణరంగంలో నమ్మకమే పునాదిగా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగిన ప్రణీత్ గ్రూపు చైర్మన్ కామరాజు నరేంద్ర బ్రాహ్మణ యువత జీవితంలో స్థిరపడాలని చక్కని ఆలోచన చేశారు. ప్రణీత్ గ్రూప్ చైర్మన్ నరేంద్ర, న్యూ నల్లకుంటలోని బ్రాహ్మణ హాస్టల్ తో పాటు తొలి బ్రాహ్మణ చానల్ AB6 NEWS సౌజన్యంతో ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు.

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు పోటీ పరీక్షల్లో శిక్షణ నిమిత్తం హైదరాబాద్ వచ్చే ఆర్థికంగా వెనకబడిన యువత వసతీ,భోజన సౌకర్యాలు కల్పించాలని ప్రణీత్ గ్రూప్ చైర్మన్ కామరాజు నరేంద్ర నిర్ణయించారు.

హైదరాబాద్ నల్లకుంటలోని బ్రాహ్మణ హాస్టల్ లో మిగిలి ఉన్న 50 బెడ్స్ లలో నిరుద్యోగ యువతకు ఈ సౌకర్యం కల్పించబోతున్నారు. బ్రాహ్మణ హాస్టల్ లో యాజమాన్యంకు వసతీ,భోజనాలకు సంబంధించిన సొమ్ము కామరాజు నరేంద్ర చెల్లించనున్నారు.

పోటీ పరీక్షలకు వచ్చే వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలనే లక్ష్యంతో ఈ సౌకర్యం కల్పించబోతున్నారు.

ఈ సదుపాయం పొందాలనుకున్నవారు ఎప్రిల్ 20 లోపు ఎంట్రీ చేయించుకోగలరు. మీ వివరాల తో కలగ రాఘవరావు ను 7337252627 నంబర్ పై సంప్రదించగలరు.

Related posts

మాదక ద్రవ్యలను అరికట్టడంలో అందరూ భాగస్వాములు కావాలి

Bhavani

రూఫ్ లేచిపోయినా.. ఆగని బస్ డ్రైవర్

Bhavani

ప్రజల్ని మభ్య పెట్టేందుకే పోలవరం సందర్శన డ్రామా

Satyam NEWS

Leave a Comment