పేదల సొంతింటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రధాన ఆశయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గృహలక్ష్మి పథకం అందుకు సంబంధించిన గైడ్ లైన్స్ జి.ఓ విడుదల చేసిన సందర్బంగా సీఎం కేసిఆర్ కు మంత్రి పువ్వాడ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.గృహ లక్ష్మి పథకం కేసిఆర్ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వరం లాంటిదన్నారు.
కేసిఆర్ మానస పుత్రిక గృహ లక్ష్మి పథకమని పేర్కొన్నారు. సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు 3లక్షల ఆర్ధిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇండ్లు చొప్పున మొత్తం 4లక్షల ఇండ్లు నిర్మాణానికి రూ.7,350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
మొత్తం 4 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. నిత్యం పేదల సంక్షేమం కోసమే ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి కేసిఆర్ కి పేదల పక్షాన మంత్రి తన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.