సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తో నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. వడదెబ్బ కారణంగా రెండు రోజులుగా అస్వస్థతకు విక్రమార్క ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
అస్వస్థత నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీనివాస్ రెడ్డి.ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ లో జరుగుతున్న రాజకీయ సమీకరణలపై ఇద్దరి మధ్యన ఏకాంతంగా చర్చలు జరిగాయి. అలాగే ఖమ్మంలో జరగబోయే పాదయాత్ర ముగింపు సభ, పార్టీలో చేరికల అంశంపై కూడా సందర్భంగా వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.