బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి కరోనా సోకింది. ఈ విషయాన్నిఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వైరస్ ప్రారంభ లక్షణాలను కనిపించిన వెంటనే టెస్టు చేయించుకున్నాను ఫలితం పాటిటివ్ అని వచ్చిందన్నారు. వైద్యుల సలహా మేరకు అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నాను నా ఆరోగ్యం బాగుంది అని ట్విట్లో వెల్లడించారు. గత కొద్ది రోజులుగా నన్నుసంప్రదించినవారు, దగ్గరగా మెలిగినవారు టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను అని జేపీ నడ్డా పేర్కొన్నారు.
previous post