27.7 C
Hyderabad
May 18, 2024 01: 36 AM
Slider విజయనగరం

బొబ్బిలి గ్రోత్ సెంట్రల్ లో అమాత్యుల రక్త సంబంధీకులు…!

#nagarjuna

కారుచవకగా భూమి కట్టబెట్టిన ఏపీఐఐసీ..!

విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ లో జరుగుతున్న భూ భాగోతంపై రెండు, మూడు రోజుల్లో టీడీపీ పోరాటం చేపట్టబోతోందని…ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున చెప్పారు. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. బొబ్బిలి గ్రోత్ సెంటర్ లో జిల్లా కు చెందిన సీనియర్ మంత్రి తమ్ముళ్లు… ఓ కంపెనీ పెట్టి… ఎకర…పది లక్షల చొప్పున తీసుకున్నారని నాగార్జున ఆరోపించారు. రెండేళ్ల క్రిందట…ఎకరా 60 లక్షల పలుకగా ప్రస్తుతం 80 లక్షలు దాటితే కేవలం పది లక్షల కు ఎలా తీసుకున్నారో ప్రజలకు తెలియచెప్పాలన్నారు.ఈ విషయం పై టీడీపీ లోతుగా అధ్యయనం చేస్తోందని… రెండు రోజుల్లో బొబ్బిలి గ్రోత్ సెంటర్ వద్ద మా పార్టీ ఆందోళన చేపడుతుందని నాగార్జున స్పష్టం చేశారు.

Related posts

ముస్లింలు ఇంట్లోనే ప్రార్ధనలు చేసుకోండి

Satyam NEWS

హిందువుల మనోభావాలను దెబ్బతీసే పోస్టింగులపై ఫిర్యాదు

Satyam NEWS

వ్యాక్సినేషన్ ద్వారానే కరోనాను తరిమికొట్టగలం

Satyam NEWS

Leave a Comment