సిమ్ కార్డ్ లు అమ్మే డీలర్ల కి కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటి వరకూ ఉన్న నిబంధనలు మార్చినందున అందరూ కచ్చితంగా కొత్త నిబంధనలు పాటించాలని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కొత్త నిబంధనలు రూల్ ఉల్లంఘిస్తే రూ.10 లక్షల వరకూ జరిమానా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో నకిలీ సిమ్ కార్డుల తో ప్రజలని మోసం చేస్తున్న విషయం అందరికి విదితమే. అందుకు గాను కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సిమ్ కార్డులు జారీ చేసే డీలర్లకు బయోమెట్రిక్, పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి అని పేర్కొంది. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి రూ.10 లక్షల జరిమానా విధిస్తామని కేంద్ర వెల్లడించింది. నకిలీ సిమ్లను జారీ చేసే ప్రక్రియకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కొత్త నిబంధన ప్రకారం ఒక ఆధార్ పై నాలుగు సిమ్ కార్డులు మాత్రమే తీసుకునే వీలుంది. గతంలో తొమ్మిది వరకూ సిమ్ లు తీసుకోవచ్చు.
previous post