గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాతీయ కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క సూచించారు. రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ములుగు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని సీతక్క తెలిపారు. కాబట్టి ప్రజలు ముందస్తుగా జాగ్రత్త వహించాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఏతైనా ప్రాంతంలో ఉండాలని, కరకట్ట వాగు అంచున ఉన్నటువంటి ప్రజలకు అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.