36.2 C
Hyderabad
April 27, 2024 21: 33 PM
Slider ముఖ్యంశాలు

ముస్లింలు ఇంట్లోనే ప్రార్ధనలు చేసుకోండి

Mecca-Masjid-68352

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మసీదుల్లో ఇమామ్,మౌసమ్ లు మాత్రమే ప్రార్థనలు చేస్తారని, మిగిలిన వారు మసీదుల్లో ప్రార్ధనలకు వెళ్లొద్దు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ఏపీ వక్ఫ్ బోర్డ్ సీఈవో అలీమ్ బాషా కోరారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ముస్లిం లా బోర్డ్ కూడా ఈ మేరకు ఫత్వా జారీ చేసిందని ఆయన తెలిపారు.

దార్ ఉలూమ్ దియోబంద్, జమై నిజామియా వంటి యూనివర్సిటీలు కూడా ఇదే చెప్తున్నాయని ఆయన అన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కూడా శుక్రవారం ప్రార్ధనలు ఇంట్లో చేసుకోవాల్సిందిగా ఫత్వా జారీ చేసిందని ఆయన వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ నేపథ్యంలో ముస్లిం సోదరులంతా సహకరించాలని కోరుతున్నామని ఆయన అన్నారు.

Related posts

డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేత శారదక్క

Satyam NEWS

ప్రజా సమస్యల పరిష్కారానికై కదిలిన టీడీపీ…!

Satyam NEWS

కాంట్రవర్సీ: అర్చకుల లెక్కలు గోవిందార్పణం

Satyam NEWS

Leave a Comment