హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వ్యక్తిపై బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు. హిందూ స్త్రీలను అవమానించే విధంగా కడప జిల్లా మైదుకూరుకు చెందిన షేక్ అహ్మద్ అనే యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తాము గుర్తించామని బిజెపి నాయకులు పోలీసులకు తెలిపారు.
అందుకు సంబంధించిన ఆధారాలను కూడా వారు పోలీసులకు అందచేశారు. దాంతో షేక్ అహ్మద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం షేక్ అహ్మద్ పరారీ కాగా పోలీసులు గాలిస్తున్నారు.