ఉత్తరాంధ్ర లో బ్రహ్మర్షి శ్రీశ్రీ శ్రీ స్వామి రామానంద పరమహంస వారి సమాధి ఆరాధన కార్యక్రమం శ్రీశ్రీశ్రీ స్వామి రామానందుల వారి యోగజ్ఞానాశ్రమంలో ప్రారంభమైంది. ఆశ్రమ పీఠాథిపతి శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వరుని గురూజీ వారి ముకుళిత హస్తాలతో శిష్యబృందం తో కలిసి వైభవోపేతంగా సాగుతోంది. ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలస లో 1962లో ప్రతిష్ఠించబడిన యోగజ్ఞానాశ్రమంలో స్వామిజీ వారి 30వ సమాధి ఆరాధనోత్సవం సందర్భంగా తెల్లవారుజామున నుంచీ ప్రాణాయామం తో సద్గురు పూజ ,సమాధి ఆరాధన ,ఉపదేశాలతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనంతరం ఆశ్రమ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీగురూజీ చే ఆధ్యాత్మిక ప్రసంగం జరిగింది. ఈ సమాధి ఆరాధనోత్సవానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాక ఏపీ, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా శిష్యులు పాల్గొన్నారు.
previous post