37.2 C
Hyderabad
May 6, 2024 22: 55 PM
Slider కడప

సిఎం సొంత జిల్లాలో అధ్వాన్నంగా రహదారులు

#BatyalaChengalraidu

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం లోని రోడ్ల దుస్థితి పై రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బత్యాల చెంగల రాయుడు ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రోడ్లకు 12వేల కోట్లు రూపాయలు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాజంపేట నియోజకవర్గ పరిధిలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. అరగంట ప్రయాణంకు నాలుగు గంటలు పడుతోందని అన్నారు. నందలూరు-టంగుటూరు రోడ్డు ఇసుక టిప్పర్ మూలంగా ధ్వంసం అయ్యిందని అన్నారు.

కడప రేణిగుంట రోడ్డు తో పాటు అన్నీ రోడ్లు దెబ్బ తిన్నాయని ఆయన అన్నారు. నీళ్లు నిలవడంతో రోడ్లలో చేపలు పట్టే పరిస్థితి వచ్చిందని అన్నారు.

టీడీపీ హయాంలో ఉన్నట్టు వైసీపీ ప్రభుత్వం రోడ్లు పునరుద్ధరిస్తే  చాలు కష్టాలు తీరినట్టే అన్నారు.

Related posts

జగన్ నియంత పాలనపై కలిసి పోరాడుదాం

Satyam NEWS

మళ్లీ కంపించిన రాజధాని ఢిల్లీ

Satyam NEWS

తిరుపతికి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునరుద్ధరించాలి

Bhavani

Leave a Comment