విద్యలనగలమైన విజయనగరం లో పొద్దుపొద్దునే..మువ్వెన్నల పతకాం…నగర వీధుల్లో రెపరెపలాడింది.ఆజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంగా జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో… జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు సమక్షంలో పుర వీధుల్లో 150 అడుగుల జాతీయ పతాకాన్ని ఎగుర వేసారు.ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహిస్తున్న విద్యుత్ మహోత్సవం సందర్భంగా ఈ భారీ జాతీయ పతాకంతో ఉద్యోగ ఉపాధ్యాయ..కళాశాల విద్యార్ధినీ విద్యార్దులందరూ ర్యాలీ లో పాల్గొన్నారు..
ఈ ర్యాలీ లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజనీర్ పి.నాగేశ్వర రావు, ఇ.ఇ. కృష్ణమూర్తి, జిల్లా యూత్ అధికారి విక్రమాదిత్య, జిల్లా నోడల్ అధికారి పి.ఆనంద్ బాబు తదితరులు హాజరయ్యారు.
నగరంలోని మూడు లాంతర్లు కూడలి నుంచి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు జరిగిన ర్యాలీ లో పెద్ద ఎత్తున పాల్గొన్న యువత, విద్యార్దులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.