29.7 C
Hyderabad
May 3, 2024 05: 11 AM
Slider వరంగల్

గజ్జి మల్లికార్జున్ కు ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ అవార్డు

#gajjimallikarjun

ములుగు జిల్లాకు చెందిన మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు గజ్జి మల్లికార్జున్ కు ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ అవార్డు ప్రకటించారు. ఈ నెల 13న  తిరుపతిలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల సదస్సులో ఈ జాతీయ అవార్డును ఆయనకు బహూకరిస్తారు. ప్రత్యేక తెలంగాణ కోసం 14 సంవత్సరాల పాటు కాళ్లకు చెప్పులు లేకుండా గజ్జి మల్లికార్జున్ తిరిగారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం అహర్నిశలు, దీక్ష కార్యక్రమాలు చేసినందుకు 2021 సంవత్సరపు ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ అవార్డు ను బహుజన సాహిత్య అకాడమీ(BSA) ఈ అవార్డును ప్రకటించింది. B S A జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ ఈ అవార్డును అందచేస్తారు.

ఈ సందర్భంగా మల్లికార్జున్  మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ నేషనల్ అవార్డును ప్రకటించినందుకు BSA జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణకు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మల్లగల్ల మల్లేష్ గౌతమ్ కు, రాష్ట్ర కమిటి సభ్యులు బ్లాదెపల్లి సిద్ధార్థ, కరేలి నర్సింహులు, ఆరెల్లి లక్ష్మీరాజం, కనుకుంట్ల విజయకుమార్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు తాటి కంటి ఐలయ్య లకు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

మంత్రి గౌతమ్ రెడ్డి కి ఎంపీ ఆదాల శ్రద్ధాంజలి

Satyam NEWS

ప్రొటెస్ట్: నరసరావుపేటలో సంపూర్ణంగా బంద్

Satyam NEWS

శబరిమల యాత్రకు టిఎస్ ఆర్టిసి ప్రత్యేక అద్దె బస్సులు

Satyam NEWS

Leave a Comment