24.7 C
Hyderabad
May 17, 2024 00: 23 AM
Slider విజయనగరం

ఆండ్రలో దొంగత‌నం ప‌ని ఆక‌తాయిల ప‌నే….!

#vijayanagarampolice

పోలీసుల అదుపులో  ముగ్గురు నిందితులు

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని ఇటీవ‌ల గ‌జ‌ప‌తిన‌గ‌రం సర్కిల్ ఆండ్ర పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓ  ఇంట్లో  దొంగ‌త‌నానికి పాల్ప‌డింది ఆక‌యితాలేన‌ని పోలీసులు నిర్దారించారు.ఈ మేర‌కు ఫిర్యాదు అందిన వెంట‌నే  కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేసిన ఆండ్ర ఎస్ఐ సుద‌ర్శ‌న‌రావు బృందం…ముగ్గురు ఆక‌తాయిల‌ను  అదుపులో తీసుకున్నారు. వాళ్ల వ‌ద్ద నుంచీ అప‌హ‌రించిన మూడున్న‌ర తులాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ  విష‌యాన్ని ఎస్ఐ సుద‌ర్శ‌న్ రావు మీడియాకు తెలియ చేసారు. గ్రామంలో ఆకతాయిగా సంచరిస్తున్న వ్యక్తుల వేలి ముద్రలను సేకరించి, వారి కదలికలపై నిఘా పెట్ట‌గా  దొంగ‌త‌నం వెలుగులోకి వ‌చ్చింది. జల్సాల కోసం.. విచ్చలవిడిగా డబ్బులు ఖ‌ర్చు కోసం ముగ్గురూ ముఠాగా మారి అదను చూసి మాటు వేసి దొంగ‌త‌నానికి  పాల్ప‌డ్డారు. ఈ కేసులో ముగ్గురిని నిందితులుగా గుర్తించి వారి వద్ద నుండి మూడున్నర తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండ్ కు తరలించారు.

Related posts

గుంతల రోడ్ల రిపేరుకు చర్యలు

Satyam NEWS

ఎట్రాషియస్: కిరాణా షాపులపై పోలీసుల దాష్టీకం

Satyam NEWS

క్రైమ్ త్రిల్లర్: అప్పు చెల్లించమన్నందుకు కత్తులతో దాడి

Satyam NEWS

Leave a Comment