ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గుంతలు పడిన రోడ్లను వెంటనే రిపేరు చేయాలని హైదరాబాద్ లోని కాచిగూడ డివిజన్ ప్రజలు కోరుతున్నారు. కాచిగూడ డివిజన్ చౌరస్తా పెట్రోల్ పంపు పక్క గల్లిలో రోడ్డుపై గుంతలు పడి వాహనదారులు, ఆ ప్రాంత నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కాచిగూడ కార్పొరేటర్ కన్నే ఉమారమేష్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు కన్నే రమేష్ యాదవ్ తో కలిసి అక్కడికి వెళ్లి పరిస్థితిని గమనించారు. జీహెచ్ఎంసీ ఏఈ దివ్య, వర్క్ ఇన్స్పెక్టర్ నరేష్ లని పిలిపించి ఈ సమస్యని పరిష్కరించడానికి వెంటనే ప్యాచ్ వర్క్ చేయాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బి. సంతోష్, భీమ్ రాజ్, ఆర్.సంతోష్, రవి యాదవ్, దినేష్ శైలేందర్ పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట