తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలో సముచిత స్థానం కల్పించాలని తెలంగాణ మాదిగ దండోరా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు డికే.మాదిగ డిమాండ్ చేశారు.
ఈ కమిటీలో మాదిగలకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదని ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. గత 27 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్న మాదిగ జాతి మీద, వివక్ష చూపకుండా వాళ్ల స్థాయికి తగ్గట్టు పదవులు కట్టబెట్టాలని డికే.మాదిగ డిమాండ్ చేశారు.
టిఆర్ఎస్ పార్టీ జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు కేటాయించవలసిన సీట్లను మాదిగలకు కేటాయిస్తుందని ఆయన అన్నారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ సీటు మాదిగలకు ఇవ్వాలని కూడా ఆయన కోరారు. అదేవిధంగా అచ్చంపేట్, ఆలంపూర్ అసెంబ్లీ నియోజక వర్గాలను కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు ఇవ్వాలని తెలంగాణ మాదిగ దండోరా తరఫున విజ్ఞప్తి చేశారు.
ఏది ఏమైనా జనాభా దామాషా ప్రకారం కాంగ్రెస్ పార్టీ మాదిగలకు పదవులు కట్టబెట్టి రాబోయే ఎలక్షన్ లో జనాభా నిష్పత్తి ప్రకారం టికెట్లు కేటాయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ దండోరా యువకులు రాము, భాస్కర్, స్వామి, సీనియర్ నాయకులు చారకొండ బాలస్వామి వీరపాగ వెంకటయ్య, పుట్ట పోగు కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.