కరోనా వైరస్ ను ప్రపంచం మీదికి వదిలిన చైనా దేశంలోని వూహాన్ సిటీ మరో మూడు రోజుల్లో స్కూళ్లను తెరవబోతున్నది. ఇంత కాలం విద్యా సంస్థలను మూసుకుని కూర్చున్న వూహాన్ సిటీ లో 2,842 స్కూళ్లు ఉన్నాయి. వాటిలో మొత్తం 14 లక్షల మంది పిల్లలు చదువుకుంటారు.
తమ నగరంలో స్కూళ్లు తెరవబోతున్నట్లు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. వూహాన్ యూనివర్సిటీ ఇప్పటికే తెరిచారు. ప్రతి స్కూల్ లో కరోనా వ్యాధి నివారణ సామాగ్రి ఉంచుతున్నారు.
అయితే విద్యార్ధులు అందరూ కూడా మాస్కులు ధరించి మాత్రమే స్కూల్ కు రావాలని స్థానిక అధికారులు కోరారు. కరోనా వైరస్ కారణంగా వూహాన్ సిటీలో ఇప్పటికి 3,869 మంది చనిపోయారు.
వూహాన్ సిటీ నుంచే కరోనా వైరస్ ప్రపంచం మొత్తం విస్తరించిన విషయం తెలిసిందే.