గోల్నాక లోని శ్రీ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం( గోల్డన్ టెంపుల్ ) లో నేడు బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బస్తీ అధ్యక్షులు బడుగుల బాలకృష్ణ మాదిగ, కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, వివిధ రాజకీయ నాయకులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పోతారాజు ఆటపాటలతో బోనాలు తోట్టెల ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన చిన్న పెద్దలకు యువకులకు అందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
బోనాల జాతరా సందర్బంగా గోల్నాక డివిజన్ కంగార్నగర్ బస్తీలోని శ్రీ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంకు విచ్చేసిన అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, సికింద్రాబాద్ సంఘ సంస్కార్త, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాయి బాబా, వివిధ పార్టీ రాజకీయనాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా బస్తీ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించారు. అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పోతారాజు ఆటపాటలతో బోనాలు తోట్టాలా ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బస్తీ కమిటీ సభ్యులు, యువత పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్