కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో ప్రభుత్వ జూట్ పరిశ్రమ మళ్ళీ వివాదాంలోకి చేరింది. నేడు పరిశ్రమ పనులు ప్రారంభించడంతో రైతులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. వెంటనే పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గతంలో పనులు ప్రారంభిస్తే రైతులందరం అడ్డుకుని కాంగ్రెస్ నేత మదన్ మోహన్ సహకారంతో రెండు నెలలుగా పోరాడి కోర్టులో కేసు వేసామన్నారు. ఈ కేసు ఇంకా కోర్టులో కొనసాగుతుండగానే పనులు ఎలా మొదలు పెడతారని రైతులు టిప్పర్లను అడ్డుకున్నారు. ఈ విషయమై జూట్ పరిశ్రమ సూపర్ వైజర్ ఎల్లంను ఫోన్లో సంప్రదిస్తే కోర్టు ఇచ్చిన స్టే గడువు ముగిసిపోయిందని, అందుకే పనులు మొదలు పెట్టామని చెప్పారన్నారు. తాము కేసు వాపసు తీసుకుంటున్నట్టుగా ఎక్కడ సంతకాలు పెట్టలేదని, అలాంటప్పుడు కేసు విత్ డ్రా ఎలా అవుతుందని ప్రశ్నించారు. పనులు ప్రారంభిస్తే మళ్ళీ ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తూ పనులు నిలిపివేయించారు.
previous post