సినీనటి శ్రీ సుధా రెడ్డి ఎస్.ఆర్.నగర్ సిఐ మురళీకృష్ణ పై ఏసీబీకి ఫిర్యాదు చేసింది. కొద్ది రోజుల క్రితం చోటా కె నాయుడు తమ్ముడు శ్యామ్ కె నాయుడు పై ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడానికి సిఐ తన నుంచి 5 లక్షల తీసుకున్నాడని శ్రీ సుధా ఆరోపించారు.
ఆ కేసులో శ్యామ్ కె నాయుడు ను అరెస్టు చేయలేదని, కోర్టులో తాము ఇద్దరం కాంప్రమైజ్ అయినట్టు నకిలీ లెటర్ సృష్టించారని ఆమె ఫిర్యాదు చేశారు. సీఐ తో మాట్లాడిన ఎవిడెన్స్ ను కూడా ఏసీబీ అధికారులకు అందచేసినట్లు శ్రీ సుధా అంటున్నారు.