కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెన్షన్ మన హక్కు-పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప అనే వినాదంతో పెన్షన్ విద్రోహ దినం నయవంచన సభ కు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం పెన్షన్ విద్రోహ దినం నయవంచన సభ ను ఏపీ సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించగా,పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని రెండు లక్షల మంది ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్ విధానం రద్దయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. పాత పెన్షన్ పునరుద్ధరణ కొరకు నిర్వహించిన నయవంచన సభకు అన్ని శాఖల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.