ములుగు జిల్లా లోని పెద్దాపురం, గుర్రంపేట పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ములుగు జిల్లా లో అర్హుడైన ప్రతి ఓటరు జాబితాలో ఉండాలని ఆదేశించారు. గతంలో ఓటింగ్ తక్కువ శాతం అయినందున ఈసారి ఎక్కువ శాతం ఓటింగ్ అయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు. ఓటర్ లిస్టులో ఏటువంటి పొరపాట్లు లేకుండా చూడాలని సూచించారు. వారి వెంట స్విఫ్ అధికారి ఈపీ ప్రేమలత వెంకటాపూర్ ఎమ్మార్వో తాజుద్దీన్ తదితరులు ఉన్నారు.