మహిళా దినోత్సవం సందర్బంగా విజయనగరం మేయర్ విజయలక్ష్మీ
అత్త,మామ,భర్త పిల్లలు ఇలా కుటంబంతో పాటు సమాజాన్ని కూడా నడిపించేంది ఒక్క స్త్రీ మాత్రమేనని విజయనగరం నగర మేయర్ విజయలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా విజయనగరంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో జరిగిన మహిళాదినోత్సవ వేడుకలలో పాల్గొన్న మేయర్ మాట్లారు. ఆర్దికంగా,సామాజికంగా రాజకీయంగా మహిళలందరూ ఎదగాలని మన సీఎం జగన్ పని చేస్తున్నారన్నారు.అలాగే సమాజ అభివృద్దికి ఓ మహిళ గా స్త్రీ ఎనలేని పాత్ర పోషిస్తోందని మేయర్ అన్నారు.ప్రతీ మహిళా ఇంట్లో భర్తకు గౌరవం ఇస్తే…బయటకూడా గౌరవం దక్కుతుందని మేయర్ అన్నారు.ఇకమనం ఎక్కువ తక్కువ కాకుండా చేసే పనులనుసక్రమంగా పని చేస్తే..ఎప్పుడైనా…?ఎక్కడైనా గుర్తింపు వస్తుందన్నారు.ఎక్కువ తక్కువ చూడకుండా.చేసే పనిపైనే దృష్టి పెట్టాలన్నారు. సీఎం జగన్ కూడా ఆఉద్దేశ్యంతోనే ప్రతీ పథకాన్ని మహిళలకే మంజూరు చేస్తున్నారని మేయర్ అన్నారు.