ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట లోని శ్రీ కోదండ రామ స్వామి కి గురు పొర్ణమిలో సోమవారం భాగంగా స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా గా సాగింది.ఈ కల్యాణమహోత్సవంను టీటీడీ వేదపండితులు ఆధ్వర్యంలో శాస్రోక్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కల్యాణ వరులను పట్టు వస్త్రా లతో,స్వర్ణా భరణాలతో,వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు.హారతి,హోమం,మాంగళ్య ధారణతో కళ్యాణం వేడుకగా ముగిసింది.కల్యాణ ప్రాంగణం జై శ్రీరామ్ నినాదాలతో ప్రతిధ్వనించింది.అనంతరం పాల్గొన్న భక్తులకు టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.