25.2 C
Hyderabad
May 16, 2024 19: 36 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

నోట్ల రద్దు అనే ఉగ్రవాద చర్యకు మూడేళ్లు పూర్తి

rahulgandhi

పెద్ద నోట్ల రద్దు అనే ఉగ్రవాద దాడి జరిగి నేటికి మూడు సంవత్సరాలు పూర్తి అయిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. భారత దేశ ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసిన దారుణమైన ఈ రోజును ఎవరూ మరచిపోలేదని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. లక్షలాది మంది చిన్న వ్యాపారులు తమ జీవనోపాధికి దూరం అయిన ఈ రోజు చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిందని ఆయన అన్నారు. లక్షలాది మంది భారతీయులను నిరుద్యోగులుగా మార్చిన రోజు ఇదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము దాచుకున్న డబ్బులు తీసుకోవడానికి రోజుల తరబడి క్యూ లైన్ లలో నిలబడి తో మంది ఈ ఉగ్రవాద చర్య కారణంగా మరణించారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ ఉగ్రవాద చర్య వెనుక ఉన్నవారు చట్ట ప్రకారం ఇంకా శిక్ష అనుభవించలేదని ఆయన ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

Related posts

పివిపిని బెదిరించిన కేసులో బండ్ల గణేష్ అరెస్టు

Satyam NEWS

మహాత్మా గాంధీజికి  నివాళులు

Satyam NEWS

విశాఖ నారాయణ కాలేజీలో దారుణం

Satyam NEWS

Leave a Comment