విశాఖపట్నంలోని నారాయణ కాలేజీలో దారుణం జరిగింది. నారాయణా కాలేజీ వేధింపులకు మరో విద్యార్థి బలి అయ్యాడు. ముఖేష్ అనే విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనందపురం వెల్లంకి బ్రాంచ్ లో ఈ హృదయవిదారక ఘటన జరిగింది. అయితే తమ కాలేజీలో ఎలాంటి మృతి జరగలేదంటూ డీన్ గణేష్ చెబుతున్నారు. నారాయణ కాలేజీ పేరు వింటేనే విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న ముఖేష్ పార్వతీపురం మండలం వీరఘట్టం గ్రామానికి చెందిన వాడుగా గుర్తించారు. ముఖేష్ నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు.
previous post